శాన్ జోస్, మే 26: అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. కాలిఫోర్నియాలోని శాన్ జోస్ రైల్వేయార్డ్లో బుధవారం ఉదయం కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతిచెందినట్టు శాంటాక్లారా కౌంటీ అధికారప్రతినిధి ఒకరు తెలిపారు. కాల్పులకు పాల్పడిన అనుమానితుడు కూడా మృతిచెందాడని చెప్పారు. బాధితుల వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. అనుమానితుడు ఎలా చనిపోయాడు అన్నది ఇంకా నిర్ధారించలేదని మరో అధికారప్రతినిధి డిప్యూటీ రసెల్ డేవిస్ తెలిపారు.