మద్యం తాగి నిర్లక్ష్యంగా బండి నడిపి ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్న వ్యక్తికి 10 ఏండ్ల జైలు శిక్ష పడేలా కేసు పెట్టారు సైబరాబాద్ పోలీసులు. మాదాపూర్ పర్వతానగర్ ఎక్స్ రోడ్డు వద్ద ఈ నెల 5న అర్ధరాత్రి 2.30 గంటలకు సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన కనవేణి రాకేశ్ వర్మ విధులు ముగించుకుని యాక్టివాపై ఇంటికి వస్తున్నాడు. అదే సమయంలో బోరబండ ప్రాంతానికి వీర రాఘవ చౌదరి మద్యం మత్తులో అతి వేగంగా బుల్లెట్పై వస్తూ.. సిగ్నల్ పడినా ఆగకుండా దూసుకెళ్లాడు.. అదే సమయంలో రాకేశ్ వర్మను ఢీకొట్టాడు. దీంతో రాకేశ్వర్మకు తీవ్ర గాయాలు కాగా…చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనను పూర్తిగా విశ్లేషించిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రాఘవచారి మద్యం మత్తులో ఉన్నాడని తేల్చారు. దీని కోసం ప్రమాదం జరిగిన స్థలం నుంచి అతను బయలుదేరిన ప్రాంతం వరకు సీసీ కెమెరాలను పరిశీలించారు. అతడిపై 10 ఏండ్ల జైలు శిక్ష పడేలా సెక్షన్ 302 పార్ట్ -2 విధించారు. పోలీసులు పూర్తి సాంకేతిక ఆధారాలను సేకరించి రాఘవచారి మద్యం మత్తు కారణంగా రాకేశ్ వర్మ మృతి చెందాడని తేల్చారు. ఈ నెల 14న అతడిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు.