పైలట్ ప్రాజెక్టు కింద జిల్లాలో 15 వేల ఎకరాల్లో సాగు చేపట్టాలి
రైతులకు అవగాహన కల్పించాలి
శరవేగంగా ‘పాలమూరు’ పనులు
మంత్రి శ్రీనివాస్గౌడ్
హైదరాబాద్లో మలేషియాకు చెందిన ప్రతినిధులతో సమావేశం
మహబూబ్నగర్, ఏప్రిల్ 2 : ఆయిల్పాం సా గు పెంచాలని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. మలేషియాకు చెందిన ఎఫ్జీవీ-పీయూ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులతో శుక్రవారం హైదరాబాద్ క్యాంపు కార్యాలయంలో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని శరవేగం గా పూర్తి చేసేందుకు సంకల్పించారన్నారు. ఈ నేపథ్యంలో కరివెన, ఉదండాపూర్ రిజర్వాయర్ల కింద అత్యధికంగా సాగునీరందనున్నట్లు తెలిపారు. వ రికి ప్రత్యామ్నాయంగా అధిక లాభాలు వచ్చే ఆ యిల్పాం సాగు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పైలట్ ప్రాజెక్టు కింద జిల్లాలో 15 వేల ఎకరాల్లో సాగు చేసేందుకు రైతులకు అవగాహన కల్పించనున్నామన్నారు. మహబూబ్నగర్ జిల్లాలోని సంబంధిత శాఖ అధికారులతో సమావేశమై పూర్తి స్థాయిలో చర్చించనున్నట్లు పేర్కొన్నా రు. సమావేశంలో కొడంగల్ ఎమ్మెల్యే పట్నం న రేందర్రెడ్డి, ఎప్జీవీ-పీయూ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ ముఖ్య కార్యదర్శి రెమాండ్లీ, కంపెనీ ప్రతినిధులు రామ్మోహన్రావు తదితరులు ఉన్నారు.