హైదరాబాద్ : రాష్ర్ట వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మెపై మంత్రి కేటీఆర్ స్పందించారు. జూనియర్ డాక్టర్లు తక్షణమే సమ్మె విరమించి విధుల్లో చేరాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. సమ్మె విరమించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. జూడాల సమ్మెకు ఇది సరైన సమయం కాదు.. వారి సమస్యలను ప్రభుత్వం పరిశీలిస్తోందని కేటీఆర్ స్పష్టం చేశారు. పెంచిన స్టైఫండ్ను వెంటనే అమలు చేయాలని కోరుతూ జూనియర్ డాక్టర్లు సమ్మెబాట పట్టిన విషయం తెలిసిందే.
కేంద్రం కలగజేసుకోకపోవడం వల్లే టీకాల కొరత ఏర్పడిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ టీకా హబ్ అయినా గ్లోబల్ టెండర్లు పిలవాల్సి వచ్చిందన్నారు. కోటి వ్యాక్సిన్లకు ప్రభుత్వం ఇప్పటికే టెండర్లు పిలిచిందని కేటీఆర్ గుర్తు చేశారు.