హైదరాబాద్ : ఎస్పీ వర్గీకరణతోనే దళితుల్లోని అన్నివర్గాల వారికి న్యాయం జరుగుతుందని నాగర్ కర్నూల్ ఎంపీ రాములు అన్నారు. శుక్రవారం లోక్సభలో షెడ్యూల్డ్ కులాల రాజ్యాంగ చట్ట సవరణ బిల్లు -2021పై ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణతో దళితులందరికీ న్యాయం జరుగుతుందని అన్నారు.కేంద్ర ప్రభుత్వం తక్షణమే వర్గీకరణ చేపట్టాలని కోరారు.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ చేపట్టకపోవడంతో మాదిగలు నష్టపోతున్నారని ఆరోపించారు.
ఎస్సీ రిజర్వేషన్ను కేవలం దళితుల్లో కొన్నికులాలు మాత్రమే వాడుకుంటున్నాయని అన్నారు. అసమానతలు తొలగించేందుకు వర్గీకరణ చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గతంలో వర్గీకరణకు కోసం వేసిన కమిటీలు కూడా ఇదే విషయాన్ని స్పష్టంచేశాయని తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదం తెలిపి కేంద్ర ప్రభుత్వానికి పంపిందని గుర్తుచేశారు.