కామారెడ్డి: జిల్లాలోని గాంధారి మండలం మాధవపల్లిలో విషాదం చోటుచేసుకుంది. మాధవపల్లికి చెందిన పెద్దోళ్ల శివాజీ ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతని ఆత్మహత్యకు భార్య సంతోషి, ఇందల్వాయి ఎస్సై కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. సంతోషి ప్రస్తుతం కామారెడ్డి ఎస్పీ కార్యాలయంలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. శివాజీ మృతికి నిరసనగా మాధవపల్లి గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. మృతుని భార్య, అత్తామామలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదుచేశారు. దీంతో మృతుని బంధువులు ఆందోళన విరమించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.