చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
ముస్లింలకు రంజాన్ దుస్తుల పంపిణీ
రామడుగు, మే 6 : సర్వ మతాల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల వారిని ఆదరిసున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. రామడుగు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో గురువారం మండలంలోని పలు గ్రామాలకు చెందిన 180 నిరుపేద ముస్లిం కటుంబాలకు రంజాన్ పర్వదినం పురస్కరించుకొని వస్ర్తాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ అన్ని వర్గాలవారి పండుగలకు ప్రభుత్వం చేయూతనందిస్తుందన్నారు. అన్ని వర్గాల పండుగలను ప్రభుత్వం అధికారంగా నిర్వహిస్తున్నదని చెప్పారు..
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ..
మండలంలోని పలు గ్రామాలకు చెందిన 43 మంది లబ్ధిదారులకు మండల కేంద్రంలో 9 లక్షల 43వేల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకునేందుకు ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తున్నదన్నారు. నియోజకవర్గంలోని ప్రతి లబ్ధిదారుకీ సీఎంఆర్ఎఫ్ ద్వారా సహాయ సహకారాలు అందిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమాల్లో జడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఎండీ శుక్రొద్దీన్, ఏఎంసీ చైర్మన్ గంట్ల వెంకట్రెడ్డి, నాయబ్ తహసీల్దార్ కిరణ్కుమార్రెడ్డి, వైస్ ఎంపీపీ పూరెల్ల రాజ్గోపాల్గౌడ్, మాజీ ఎంపీపీ మార్కొండ కిష్టారెడ్డి, మండల కోఆప్షన్ సభ్యుడు రజబ్అలీ, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు ఎడవెల్లి నరేందర్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట్ల జితేందర్రెడ్డి పాల్గొన్నారు.
ఆపన్నహస్తంలా సీఎం రిలీఫ్ఫండ్
చొప్పదండి, మే 6: నిరుపేదలకు సీఎం రిలీఫ్ఫండ్ చెక్కులు ఆపన్నహస్తంలా ఉపయోగపడుతున్నాయని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలానికి చెందిన 48 మంది లబ్ధిదారులకు రూ.13లక్షలా 26వేల 500 సీఎం రిలీఫ్ఫండ్ చెక్కులను గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో దవాఖానలో వైద్యం చేసుకుని సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేసుకుంటే అవి అందని ద్రాక్షలా ఉండి ఒక్కరు కూడా లబ్ధిపొందని పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేసుకుంటే వెంటనే మంజూరవుతూ వైద్య ఖర్చులు చేసుకున్న వారికి కొండంత భరోసానిస్తున్నాయని పేర్కొన్నారు. అనారోగ్యంతో ప్రైవేట్ దవాఖానలో ఖర్చులు చేసుకున్నవారు సీఎం రిలీఫ్ఫండ్కు దరఖాస్తు చేసుకుని లబ్దిపొందాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్గౌడ్, మాజీ జడ్పీటీసీ ఇప్పనపల్లి సాంబయ్య, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్రెడ్డి, నాయకుడు మాచర్ల వినయ్ తదితరులు పాల్గొన్నారు.