జనరల్ దవాఖానలో 150పడకల కొవిడ్ సెంటర్
హైదరాబాద్ వెళ్లకుండా ఇక్కడే కరోనా వైద్యసేవలు
ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
మహబూబ్నగర్ జనరల్ దవాఖానలో ఆకస్మిక తనిఖీ
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మార్చి 19 : దే శంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నందున చేతులెత్తి మొక్కుతున్నా.. ప్రజలు జాగ్రత్తగా ఉం డాలని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ కోరారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా కేం ద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖానలో ఉన్న కొవిడ్ హెల్త్ కేర్ సెంటర్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలు, వైద్యసేవలను సిబ్బందితో అడిగి తెలుసుకున్నారు. కొవిడ్ సెంటర్ను తనిఖీ చేశారు. అ నంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. కరోనాతో భయపడాల్సిన అవసరం లేదని, ద గ్గు, జ్వరం, జలుబు వంటివి వస్తే స్థానిక ప్రభు త్వ దవాఖానకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలన్నారు. పాజిటివ్ వచ్చినా ఆందోళన చెందకుం డా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 150 పడకల క రోనా హెల్త్ కేర్ వార్డులో అడ్మిట్ కావాలని కో రారు. ఇంట్లో ఉన్న వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. జిల్లా కేంద్రం లో వైద్యపరంగా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశామని, ప్రత్యేకించి కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలతోపాటు ఎ స్వీఎస్ దవాఖానలో ఆర్టీపీసీఆర్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోనే 18 వైద్య బృందాలు నిరంతరం ప నిచేస్తున్నాయన్నారు. అంతకుముందు కరోనా ప రీక్షలు నిర్వహించే వార్డుతోపాటు, ప్రత్యేక వార్డు ను సందర్శించి రోగులతో మాట్లాడారు. ప్రత్యేక వార్డును సుందరీకరించాలని, గ్రీన్ మెస్, పూలమొక్కలు ఏర్పాటు చేయాలని సూచించారు. క రోనా వార్డును అనుకుని ఉన్న స్థలంలో 400 ప డకల దవాఖాన నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపించాలని, ప్రస్తుతం ఉన్న కలెక్టరేట్లో ఆవరణలో చిన్నపిల్లల దవాఖాన ఏర్పాటుకు చర్య లు తీసుకోవాలని అధికారులకు సూచించారు. క రోనా వార్డులో అవసరమైన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యక్రమం లో కలెక్టర్ వెంకట్రావు, అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జనరల్ దవాఖాన సూపరింటెండెంట్ రాంకిషన్, డిప్యూటీ సూపరింటెండెం ట్ జీవన్, నర్సింహారావు, మున్సిపల్ చైర్మన్ న ర్సింహులు, దవాఖాన అభివృద్ధి సంస్థ సభ్యులు లక్ష్మీ, మల్లేశ్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి శం కర్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్ ఉన్నారు.