సీడీపీవో అనురాధ
అంగన్వాడీ కార్యకర్తలతో జూమ్ యాప్ ద్వారా మీటింగ్
నిజాంసాగర్, మే 15: అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, చిన్నారులు, బాలింతలకు అందజేస్తున్న పౌష్టికాహారం సక్రమంగా పంపిణీ చేయాలని సీడీపీవో అనురాధ ఆదేశించారు. జిల్లాలోని అంగన్వాడీ కార్యకర్తలతో శనివారం జూమ్ యాప్ ద్వారా మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. వెల్గనూర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ రమేశ్గౌడ్, కార్యదర్శి గంగాసాగర్, అంగన్వాడీ కార్యకర్త లలిత, ఆశకార్యకర్త సమావేశంలో పాల్గొన్నారు. కరోనా కట్టడి విషయంలో అంగన్వాడీ కార్యకర్తలు తమవంతు కృషి చేయాలని సూచించారు. సర్పంచులు ఎప్పటికప్పుడు పౌష్టికాహారం పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించాలని అన్నారు.