నేడు పలు అభివృద్ధిపనులు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్

హైదరాబాద్: జంట నగరాల్లో మంత్రి కేటీఆర్ నేడు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రూ.28.38 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించనున్నారు. దోమలగూడలో జోనల్, డిప్యూటీ కమిషనర్ కర్యాలయాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం నారాయణగూడలో మోడల్ కూరగాయల మార్కెట్కు భూమిపూజ చేస్తారు. బాగ్లింగంపల్లిలో డబుల్ బెడ్ రూం ఇండ్లను పంపిణీ చేయనున్నారు. తొమ్మిది అంతస్థుల చొప్పున 126 డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించారు. అడిక్మెట్లో కొత్తగా నిర్మించిన మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ను ఉదయం 11.30 గంటలకు ప్రారంభిస్తారు. అదేవిధంగా మధ్యాహ్నం 12.30 గంటలకు ఎల్బీనగర్ సర్కిల్లోని మోహన్నగర్లో నిర్మించిన జంట రిజర్వాయర్లను ప్రజలకు అంకితం చేస్తారు. ఈ జంట జలాశయాలను రూ.9.42 కోట్ల వ్యయంతో జలమండలి నిర్మించింది. వీటిలో 2.5 మిలియన్ లీటర్ల నీటిని నిల్వ ఉంచవచ్చు. వీటిని శాఫ్ట్ పద్ధతిలో నిర్మించారు. ఇలా నిర్మించినవాటిలో ఆసియా ఖండంలోనే ఈ జంట జలాశయాలు అతిపెద్దవి కావడం విశేషం.
తాజావార్తలు
- కాలా గాజర్.. ఆరోగ్య సమస్యలు పరార్
- ఎస్సీ, ఎస్టీలకు ఇంటింటికి కొత్త పథకం : మంత్రి ఎర్రబెల్లి
- ఒక్క రోజు సీఎంగా.. శ్రీష్టి గోస్వామి
- బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే మసీదులు కూల్చడం ఖాయం
- ఇంటర్ విద్యార్థిని అదృశ్యం..
- గణతంత్ర దినోత్సవ అతిథులకు అభినందనలు : మంత్రి
- క్రికెట్ ఆడిన సీపీ సజ్జనార్
- విజయ్ దేవరకొండ లైగర్ షూట్ షురూ ..వీడియో
- 'గాలి సంపత్` విడుదల తేదీ ఖరారు
- రేగు పండు.. ఖనిజాలు మెండు..!