రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 18(నమస్తే తెలంగాణ): ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఇల్లంతకుంట మండలంలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, న్యాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్తో కలిసి పాల్గొననున్నారు. ఉదయం 10 గంటలకు ఇల్లంతకుంటలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభిస్తారు. 10.20 గంటలకు వివేకానంద విగ్రహం దగ్గర సెంట్రల్ లైటింగ్ సిస్టం, 10.30 గంటలకు బస్టాండ్ వద్ద మహిళా సంఘ భవనం, 10.45 గంటలకు తాసిల్ నూతన కార్యాలయ భవనం, 11 గంటలకు రైతువేదిక, 11.15 గంటలకు కూరగాయల అంగడిని ప్రారంభిస్తారు. అనంతరం అక్కడే నిర్వహించే బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. మధ్యాహ్నం రెండు గంటలకు హైదరాబాద్కు తిరుగుపయనమవుతారు.