హైదరాబాద్ : పెరిగిన గ్యాస్ సిలిండర్, పెట్రోల్ ధరలకు నిరసనగా ఇటీవల కొంతమంది హుస్సేన్ సాగర్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా నిరసన వ్యక్తం చేస్తూ.. గ్యాస్ సిలిండర్ను, బైక్ను సాగర్లో తోసేశారు. ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.
ప్రభుత్వాలు, ప్రజల దృష్టిని ఆకర్షించడానికి.. ప్రజాస్వామ్యంలో నిరసన ప్రధాన అంశమే అయినప్పటికీ.. బాధ్యతారాహిత్యంగా బైక్లను, సిలిండర్లను చెరువుల్లో తోసేయడం సరికాదని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి మహముద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.