హైదరాబాద్ : ఫ్లయింగ్ సిఖ్గా ఖ్యాతిగడించిన భారత స్ప్రింట్ దిగ్గజం మిల్కాసింగ్ మృతి పట్ల మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. మిల్కా మృతి భారత క్రీడారంగానికి శాశ్వత లోటని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. దేశం వెలకట్టలేని నిధిని కోల్పోయిందని, మిల్కాసింగ్ అంకితభావం సాటిలేదని అని మంత్రి కేటీఆర్ కొనియాడారు. మిల్కాసింగ్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.