ప్రచారం
సీఎం కేసీఆర్ హుజూరాబాద్లో కుక్కను నిలబెట్టినా గెలుస్తాం అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించినట్టు ఇటీవల సోషల్మీడియాలో ఒక ఫొటో చక్కర్లు కొడుతున్నది. త్వరలో 10 లక్షల మందితో భారీ సభ పెట్టనున్నట్టు, మంత్రి కేటీఆర్ విలేకరులతో చిట్చాట్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసినట్టు అందులో ఉన్నది.
వాస్తవం
ఇది మంత్రి కేటీఆర్కు వ్యతిరేకంగా సృష్టించిన ఫేక్ ఫొటో. ఆయన ఇప్పటివరకు హుజూరాబాద్ ఉపఎన్నికపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. మంత్రి కేటీఆర్ కొన్ని నెలలుగా అధికారిక విధులతోపాటు కరోనాతో ఇబ్బంది పడుతున్నవారిని ఆదుకోవడంలో క్షణం తీరక లేకుండా ఉన్నారు. ఈ నేపథ్యంలో కొంతకాలంగా మీడియాతో ఎలాంటి చిట్చాట్ నిర్వహించలేదు. పైగా ఈ ఫొటోలో అనేక అక్షరదోషాలు ఉన్నాయి. అక్షరాలను అడ్డదిడ్డంగా పేర్చినట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. ఏ మీడియా సంస్థ కూడా ఇన్ని అక్షరదోషాలతో, ఇంత నిర్లక్ష్యంగా వార్తను ప్రచురించదు.