వరంగల్ అర్బన్ : వైద్యరంగం బలోపేతానికి సీఎం కేసీఆర్ విశేషంగా కృషి చేస్తున్నారని రాష్ట్ర పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాక మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. రాష్ర్టంలో ప్రజారోగ్యం భేష్గా ఉందని పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు, హైదరాబాద్లోని టిమ్స్ హాస్పిటల్ కోసం
స్త్రీ నిధి ద్వారా రూ. 50 లక్షల విలువ చేసే ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ను కొనుగోలు చేసి స్థానిక ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్లో కలెక్టర్లకు మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్స కోసం అన్ని రకాల వసతులు కల్పించామన్నారు. ముఖ్యమంత్రి చొరవతో ఎంజీఎం ఆస్పత్రి స్టాఫ్కు అన్ని వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. ఎంజీఎం రూపురేఖలను మార్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
పీపీఈ కిట్ ధరించకుండా సీఎం కేసీఆర్ సాహసోపేతంగా గాంధీలోని కొవిడ్ వార్డుల్లో పర్యటించి, రోగులకు ధైర్యాన్ని కల్పించారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి గుజరాత్ తప్ప.. ఇతర రాష్ర్టాలు కనిపించడం లేదన్నారు. కేంద్రం సహకరించకున్నా.. వ్యాక్సిన్ కొరతను తీర్చేందుకు గ్లోబల్ టెండర్లను ఆహ్వానించామని మంత్రి తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకునేలా ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా చికిత్స కోసం మందులు, ఆక్సిజన్ సరఫరాలకు ఇబ్బందులు లేవన్నారు. ఎంజీఎం ఆస్పత్రికి మరో 275 ఆక్సిజన్ ఫ్లో మీటర్లు సమకూర్చామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు.