భీమారం,మే31 : కాకతీయ యూనివర్సిటీ పరీక్షల విభాగం నియమావళి మాన్యువల్ రిపోర్టును సోమవారం వీసీ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్కు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ మహేందర్రెడ్డి బృందం అందజేసింది. ఈ సందర్భంగా మహేందర్రెడ్డి మాట్లాడుతూ.. వివిధ యూనివర్సిటీల పరీక్షల విభాగాల్లోని నియమ నిబంధనలు పరిశీలించి డ్రాఫ్ట్ను రూపొందించినట్లు తెలిపారు. డ్రాఫ్ట్ కమిటీ సభ్యులు, కేయూ అదనపు పరీక్షల నియంత్రణాధికారులు ప్రొఫెసర్ వెంకట్రామరెడ్డి, డాక్టర్ వెంకయ్య, డాక్టర్ ఎం సురే ఖ, సహాయ రిజిస్ట్రార్ అశోక్బాబు, ఆర్ శ్రీలతదేవి వీసీని కలిసి నియమావళిని అందజేశారు.
నేటి నుంచి ఆన్లైన్ తరగతులు
భీమారం, మే31 : కాకతీయ యూనివర్సిటీలో నేటి నుంచి ఆన్లైన్ తరగతులు నిర్వహించనున్నట్లు క్యాంపస్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డేవిడ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. యూనివర్సిటీ టైంటేబుల్ ప్రకారం మొదటి సెమిస్టర్, నాల్గో సెమిస్టర్ తరగతులు ఆన్లైన్లో ప్రారంభించాలని ఆయా విభాగాధిపతులను ఆదేశించారు.