హైదరాబాద్ : పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం పాలకుర్తి గ్రామానికి చెందిన యువకులు గుంపుల సతీష్, ప్రేమ్కుమార్. అంగవైకల్యంతో పూర్తిగా నడవలేని స్థితిలో బాధపడుతున్నారు. యువకుల దీన పరిస్థితిని రామంగుండం శాసన సభ్యులు కోరుకంటి చందర్ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. వీరి ఆరోగ్య పరిస్థితిని చూసి చలించిన కేటీఆర్ తక్షణమే చికిత్సకు హామీ ఇచ్చారు. వెనువెంటనే సన్షైన్ హాస్పిటల్ గురువారెడ్డితో మాట్లాడి వైద్యం అందించాల్సిందిగా కోరారు. వీరిద్దరి వైద్యానికి అయ్యే ఖర్చు రూ.20 లక్షలను పూర్తిగా ఇస్తానని హామీ ఇచ్చారు. దీనిపై ఎమ్మెల్యే కోరుకంటి చందర్ స్పందిస్తూ.. ప్రజా సేవలో మంత్రి కేటీఆర్ తనకు తానే సాటి అని మరోమారు చాటారని కొనియాడారు. గొప్ప మనస్సుతో స్పందించిన రామన్నకు ధన్యవాదాలన్నారు.