ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ మరింతగా విజృంభిస్తున్నది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. మొత్తం కరోనా కేసుల సంఖ్య 25 లక్షలు, యాక్టివ్ కేసుల సంఖ్య 2 లక్షలు దాటింది. ఆదివారం నుంచి సోమవారం వరకు కొత్తగా 24,265 కరోనా కేసులు, 58 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 25,04,327కు, మరణాల సంఖ్య 53,457కు చేరింది.
మరోవైపు మహారాష్ట్రలో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 22,34,330కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2 లక్షలకుపైగా యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొంది. కాగా, దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల సంఖ్యలో మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతున్నది.