పెగడపల్లి, ఆగస్టు 5: ఎంపీ బండి సంజయ్కి దమ్ముంటే కేంద్ర ం నుంచి దళిత కుటుంబాలకు రూ.40 లక్షల చొప్పున సాయం అందించాలని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సవాల్ విసిరారు. దళిత బంధుపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అర్థరహితమని మండిపడ్డారు. గురువారం జగిత్యాల జిల్లా పెగడపల్లిలో మాట్లాడుతూ.. ఒక్కో దళిత కుటుంబానికి రూ.50 లక్షల సాయం చేయాలని బండి సంజయ్ పేర్కొనడం హాస్యాస్పదంగా ఉన్నదని ఆగ్రహించారు. రాష్ట్రం అందిస్తున్న రూ.10 లక్షలకు తోడు, కేంద్రం ద్వారా రూ.40 లక్షలు అందించాలని సంజయ్కు సూచించారు. దేశంలోని 18 బీజేపీ పాలిత రాష్ర్టాల్లో తెలంగాణలో అమలుచేస్తున్న ఇలాంటి పథకం ఒక్కటైనా ఉన్నదా? అని ప్రశ్నించారు. ఆర్థికసాయం అందుకున్న దళిత కుటుంబాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాటిని పూర్తిగా సద్వినియోగం చేసుకొనేలా పథకం రూపొందిస్తున్నట్టు స్పష్టంచేశారు. అంబేదర్ బాటలో నడుస్తూ దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మహానేత అని కొనియాడారు.