హైదరాబాద్ : బతుకమ్మ పండుగ రేపు ప్రారంభమవుతున్న సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలంగాణ ఆడబిడ్డలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు ఎంతో ఇష్టంతో పూలను పేర్చి, గౌరమ్మను తీర్చి కోరిన కోరికలు ఫలించాలనే నమ్మకంతో ఈ పండుగ జరుపుకుంటారని ఒక ప్రకటనలో మంత్రి పేర్కొన్నారు.
తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన ఈ పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రజలందరినీ ఏకం చేసిన పండుగ అని వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం రాగానే బతుకమ్మ పండగను రాష్ట్ర పండుగగా ప్రకటించారు.
ఈ పండుగను సంతోషంగా జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ ఆడబిడ్డలకు ఏటా రంగురంగుల్లో, పలు డిజైన్లలో రూపొందించిన చీరెలను అందిస్తున్నారని తెలిపారు. బతుకమ్మలను పేర్చేందుకు ఎక్కువగా తంగేడుపూలను ఉపయోగిస్తారని, అందుకు గాను తంగేడు పువ్వును రాష్ట్ర పువ్వుగా ప్రకటించి బతుకమ్మ ప్రాధాన్యతను సీఎం ప్రపంచానికి చాటి చెప్పారన్నారు.
ఇవి కూడా చదవండి..
లఖింపుర్ ఖేరి ఘటనపై మంత్రి కేటీఆర్ షాక్
Crime news |ఐలాపూర్ చెరువులో పడి ఇద్దరు యువకులు మృతి
విహారంలో విషాదం..నీటిలో మునిగి సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి