Telangana
- Jan 06, 2021 , 15:17:49
దొంగ మల్లన్న స్వామిని దర్శించుకున్న మంత్రి కొప్పుల

జగిత్యాల : జిల్లాలోని గొల్లపల్లి మండలం మల్లన్నపేట గ్రామంలో బుధవారం దొంగమల్లన్న స్వామి వారిని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ దర్శించుకున్నారు. మంత్రికి ఆలయ కమిటీ పూజారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మంత్రి నిలువెత్తు బంగారం (బెల్లం) ఇచ్చి భక్తులకు ప్రాసాదాన్ని పంపిణీ చేశారు. మంత్రి వెంట స్థానిక ప్రజాతినిధులు, అధికారులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి
తాజావార్తలు
MOST READ
TRENDING