పెద్దపల్లి : తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నదని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. వేలాది కోట్లు వెచ్చించి సర్కారు దవాఖానల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నదని తెలిపారు. పెద్దపల్లి జిల్లా దవాఖాన వద్ద ఎంపీ ల్యాడ్స్ నిధులు రూ. 24 లక్షలతో కొనుగోలు చేసిన అంబులెన్స్ను శనివారం ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేతకానీతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఎంపీ వెంకటేశ్నేతకానీ మాట్లాడుతూ కరోనా కాలంలో ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించేందుకు అన్ని చర్యలు తీసుకున్నదని చెప్పారు.
అంతకుముందు ఆయన స్వయంగా అంబులెన్స్ను నడిపారు. కార్యక్రమంలో పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి, కలెక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ, అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, డీసీపీ పులిగిల్ల రవీందర్, ఏసీపీ నిఖితా పంథ్, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రఘువీర్సింగ్, డీఎంఅండ్హెచ్వో ప్రమోద్కుమార్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ప్రతి సొసైటీ లాభాల్లోకి రావాలి : మంత్రి ఎర్రబెల్లి
దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
రైతులకు న్యాయం చేస్తాం : ఎమ్మెల్యే గండ్ర
బైక్ చెట్టుకు ఢీకొని ఒకరి మృతి
క్యూలో నిలుచున్న ఓటర్లను సీఆర్పీఎఫ్ చంపేసింది..