జగిత్యాల : ఆత్మగౌరవ లోగిళ్లు.. మన డబుల్ బెడ్ రూం ఇండ్లు అని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పడకల్ గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రి బుధవారం ప్రారంభించారు. అదేవిధంగా సీసీ రోడ్లు, వైకుంఠ దామం, సైడ్ డ్రైనేజీలు, గోపాల మిత్ర భవనం, పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అభివృద్ధి-ప్రజా సంక్షేమం ప్రభుత్వానికి రెండు కండ్లు అన్నారు. తెలంగాణలోని నిరుపేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉండే విధంగా సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నారని తెలిపారు.
రాష్ట్ర పరిపాలన దేశానికే ఆదర్శంగా ఉందన్నారు. మన సీఎం కేసీఆర్ రూపొందించిన పథకాలను దేశం ఆదర్శంగా తీసుకుని అమలు చేస్తున్నదన్నారు. ఏడవ విడత హరితహారంలో భాగంగా రైతు వేదిక ఆవరణలో మంత్రి మొక్కలు నాటారు. కొత్తపేట ఎస్సీ కాలనీ వాసులతో వారి ఇండ్ల ముందే కూర్చుని పలు సమస్యలపై మంత్రి చర్చించారు.