హుజురాబాద్: ఆలయ అభివృద్ధికి రూ.15 లక్షల అనుమతి పత్రాన్నిఅందించారు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్. ఆయన మంగళవారం హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట కొత్తపల్లి లోని శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అభివృద్ధి కోసం 15 లక్షల రూపాయల అనుమతి పత్రాన్ని ఆలయ కమిటీ కి అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చందర్, మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు , పార్టీ అధ్యక్షులు రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు