న్యూఢిల్లీ: ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో కం మేనేజింగ్ డైరెక్టర్ చందాకొచర్ చందాకొచ్చర్ దంపతులకు రిలీఫ్ లభించింది. వీడియో కాన్ సంస్థకు రుణాల మంజూరు కేసులో అవకతకవలకు పాల్పడ్డారన్న అభియోగాన్ని ఎదుర్కొంటున్న భర్త దీపక్ కొచ్చర్కు బాంబే హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది.
ఇదే కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న చందాకొచ్చర్కు గత నెలలోనే బాంబే హైకోర్టు రూ.5 లక్షల వ్యక్తిగత పూచీకత్తుపై న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని ఆంక్షలు విధించింది.
మనీలాండరింగ్ కేసులో దీపక్ కొచ్చర్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గతేడాది సెప్టెంబర్లో అరెస్ట్ చేసింది. గతేడాది డిసెంబర్లో బెయిల్ కోసం దీపక్ దాఖలు చేసిన పిటిషన్ను ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. దీంతో దీపక్ కొచ్చర్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు.
తాజా ఆయన బెయిలు పిటిషన్ను జస్టిస్ పీడీ నాయక్ నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం గురువారం విచారించింది. వీడియోకాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కు రుణాలు మంజూరు చేయడంలో అవకతవకలకు పాల్పడ్డారని, తద్వారా బ్యాంకు నష్టాలకు కారణమయ్యారంటూ కొచ్చర్ దంపతులపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ తర్వాత వారిపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.
బ్యాంక్ సీఈవో కం మేనేజింగ్ డైరెక్టర్గా చందా కొచ్చర్ వైదొలిగిన కొన్ని నెలలకు ఆమెను ఆ పదవుల నుంచి తొలగిస్తున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ 2019లో ప్రకటించింది. 2019 ఫిబ్రవరిలో ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేశాయి. వీడియో కాన్కు ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రూ.1,875 కోట్ల రుణాలను మంజూరు చేయడంలో అవకతవకతలు జరిగాయని, అవినీతి చోటు చేసుకున్నాయని ఆరోపణలు వచ్చాయి.
అయితే, తామేమీ పొరపాట్లు, అవకతవకలు చేయలేదని చందాకొచ్చర్, దీపక్ కొచ్చర్ వాదించారు. చందాకొచ్చర్ హయాంలో ఐసీఐసీఐ బ్యాంకు నుంచి స్లెరింగ్ బయోటెక్, భూషణ్ స్టీల్ కంపెనీలకు మంజూరు చేసిన రుణాలపైనా ఈడీ దర్యాప్తు చేస్తున్నది.
ఈ నెలలో జీఎస్టీ వసూళ్లలో కొత్త రికార్డు..!
పీఎస్యూల ప్రైవేటీకరణతోనే వృద్ధి రేటు పరుగులు : రాకేష్ జంఝన్వాలా