జమ్మికుంట: ఈటల రాజేందర్ ఆత్మరక్షణ కోసం ఇక్కడి ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేపీకి తాకట్టు పెట్టాడని ఎస్సీ సంక్షేమశాఖ మం త్రి కొప్పుల ఈశ్వర్ మండిప డ్డా రు. ఆత్మగౌరవం అంటూ ఢిల్లీలో మోకరిల్లాడని, బీజేపీ కండువా ను అనామకుడి చేత కప్పించుకున్నాడని ఎద్దేవాచేశారు. కరీంనగ ర్ జిల్లా జమ్మికుంటలో టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఎన్నో పదవులు అందించి, గౌరవించిన టీఆర్ఎస్ను వీడి పెద్ద తప్పుచేశాడని తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ, ప్రజల ఉసురు పోసుకుంటున్న పార్టీలో ఎలా చేరుతావని ప్రశ్నించారు. పార్టీకి ద్రోహం చేసిన ఈటలకు ప్రజాక్షేత్రంలో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, జడ్పీ అధ్యక్షురాలు విజయ, సుడా చైర్మన్ జీవీ తదితరులు పాల్గొన్నారు.