హైదరాబాద్ : సరూర్ నగర్లో ఉన్న విక్టోరియా మెమోరియల్ హోంలోని 16మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణయి అయింది. విషయం తెలుసుకున్న సమంక్షేమ శాఖ మంత్రి వారిని జూమ్ ద్వారా పరామర్శించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అధైర్యపడవద్దని, తొందరగానే కోలుకుంటారని వారికి ధైర్యం చెప్పారు. విద్యార్థులను మంత్రి ఆప్యాయంగా పలకరించారు. వారి ఆరోగ్య పరిస్థితిని, అందుతున్న వైద్య సేవలు, సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్కూల్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులతో మంత్రి మాట్లాడారు.
విద్యార్థులకు ఏ లోటు రాకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, సకాలంలో మంచి భోజనంతో పాటు పండ్లు, మందులు ఇవ్వాలని ప్రిన్సిపాల్ ను మంత్రి ఆదేశించారు. వారిని కంటికి రెప్పలా చూసుకోవాలని, ఎప్పటికప్పుడు ఆక్సిజన్, టెంపరేచర్ స్థాయిలను పరీక్షించాలని, వైద్యులు నిరంతరం పర్యవేక్షించేలా చూడాలని ఆదేశించారు.
స్కూల్ హాస్టల్ లో ఐసోలేషన్ లో ఉన్న వారిని జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. అవసరమైతే దవాఖానకు తరలించేందుకు గాను అంబులెన్స్ అందుబాటులో ఉంచుకోవాలని మంత్రి సూచించారు.
ఇవి కూడా చదవండి..
అత్తను కర్రతో కొట్టి చంపిన అల్లుడు
ఈ పాస్ ఉంటేనే అనుమతి : డీఐజీ రంగనాధ్
ప్రజల ప్రాణాలు కాపాడటం మన బాధ్యత : మంత్రి నిరంజన్ రెడ్డి
రూ.22 కోట్ల ఫండ్ రేజ్ చేసిన ప్రియాంక-నిక్ దంపతులు
బస్తీ దవాఖానను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్