అబ్దుల్లాపూర్మెట్, సెప్టెంబర్ 5: బీసీ వర్గా ల ఆత్మగౌరవం కోసం తెలంగాణ ప్రభు త్వం నిరంతరం కృషి చేస్తున్నదని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపా రు. ఆదివారం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ మహాజన గర్జన సభకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. విశ్వబ్రాహ్మణ ఆత్మగౌరవ భవనానికి ఉప్పల్ భగాయత్లో 5 ఎకరాల భూమి కేటాయించినట్టు తెలిపారు. సమైక్య పాలనలో అప్పటి ప్రభుత్వాలు విశ్వబ్రాహ్మణుల సంక్షేమాన్ని పట్టించుకోలేదన్నారు. స్వరాష్ట్రం వచ్చాకే వారికి సీఎం కేసీఆర్ 5 ఎకరాల స్థలం కేటాయించడమే కాకుండా భవన నిర్మాణానికి రూ.5 కోట్లు మంజూరు చేసినట్టు తెలిపారు. రాబోయే రోజుల్లో విశ్వబ్రాహ్మణుల న్యాయబద్ధమైన కోరికలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వెనుకబడిన కులాల వారి అభ్యున్నతి కోసం రాబోయే రోజుల్లో కేసీఆర్ మంచి పథకాలను తీసుకొస్తారని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోజు భిక్షపతిచారి అధ్యక్షతన జరిగిన ఈ సభలో తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు తల్లోజు చెన్నయ్యచారి, నౌండ్ల సంతోష్చారి, నందిపేట రవీంద్రాచారి తదితరులు పాల్గొన్నారు.