జగిత్యాల : ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ను విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మంగళవారం పరామర్శించారు. బాల్క సుమన్ తండ్రి, మెట్పల్లి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్క సురేష్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. మెట్పల్లి( రేణిగుంట) లో ఎమ్మెల్యే సుమన్ ఇంటికి చేరుకున్న మంత్రి జగదీష్ రెడ్డి బాల్క సురేష్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మంత్రి వెంట రాజ్యసభ సభ్యుడు లింగయ్య యాదవ్, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
ప్రభుత్వ విప్ బాల్క సుమన్ను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత
పారిశుధ్య, ఆశా వర్కర్ల కృషి మరువలేనిది
నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ నమోదు : మంత్రి నిరంజన్ రెడ్డి
పేదింటి ఆడబిడ్డలకు వరం కల్యాణలక్ష్మి
ప్రజల నమ్మకాన్ని పెంచేలా పాలన అందించాలి