నల్లగొండ : కరోనాతో తిరుమలగిరిసాగర్ జడ్పీటీసీ సూర్యా నాయక్ భర్త బాష్యానాయక్ ఇటీవల మరణించాడు. వారి కుటుంబాన్ని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పరామర్శించారు. బాష్యానాయక్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మంత్రి వెంట స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్, ఎంపీపీ భగవాన్ నాయక్, సింగిల్ విండో చైర్మన్ కేవీ రామారావు, టీఆర్ఎస్ నేత ఎంసీ కోటిరెడ్డి, తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
మానవత్వం చాటిన ముస్లిం యువకులు..
పేదరికంతో రోడ్డున పడ్డ కుటుంబం..ఆదుకున్న మంత్రి సత్యవతి
విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు : మంత్రి పువ్వాడ
కరోనా కట్టడిలో ఎన్నారైలు భాగస్వాములు కావాలి
కరోనా లక్షణాలు ఉన్న అందరికి మందులు ఇవ్వండి