నల్గొండ జిల్లా : అమెరికాలోని మేరీల్యాండ్లో ఇటీవల దుండగుల కాల్పుల్లో మృతి చెందిన నక్క సాయి చరణ్ కుటుంబ సభ్యులను విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పరామర్శించారు. గురువారం నల్లగొండ పట్టణంలోని సాయి చరణ్ ఇంటికి చేరుకున్న మంత్రి ప్రమాద ఘటన గురుంచి అడిగి తెలుసుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. అధైర్య పడొద్దు అండగా ఉంటామన్నారు. మంత్రి వెంట నల్లగొండ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి, మాజీ ఎంపీపీ రేగట్టే మల్లికార్జున్ రెడ్డి, తదితరులు ఉన్నారు.