సూర్యాపేట: దసరా పర్వదినం సందర్భంగా సూర్యాపేట క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ విందు ఏర్పాటు చేశారు. ముస్లిం, క్రైస్తవులతో సామూహిక విందు కార్యక్రమం ఏర్పాటు చేసి, తాను కూడా వారితో కలిసి భోజనం చేశారు.
అంతకుముందు అందరితో కలిసి సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమానికి విచ్చేసిన వారితో కాసేపు ముచ్చటించిన మంత్రి అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానికులు మంత్రి జగదీష్కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయనకు శాలువా కప్పి తమ అభిమానాన్ని చాటుకున్నారు.