హైదరాబాద్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్పై రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీజేపీలో చేరిన ఈటలకు కేసీఆర్ను విమర్శించే అర్హత లేదన్నారు. ప్రత్యేక ఎజెండాతోనే ఈటల రాజేందర్ బీజేపీలో చేరారు. బీజేపీతో పాటు రాజేందర్ కూడా మునిగిపోవడం ఖాయం. రాజకీయాల్లో విబేధాలు రావడం సహజమన్నారు. ఈటల మునిగిపోయే పడవ ఎక్కుతున్నారు. నియోజకవర్గ ప్రజలను ఈటల మోసం చేశాడు. బీసీలకు బీజేపీ చేసిందేమిటని ఈటల పలుసార్లు ప్రశ్నించారు.
టీఆర్ఎస్ కంటే బీజేపీలో ఏం మంచి చూసి చేరాడో ఈటలకే తెలియాలి. ఈటల చెప్పే మాటలకు, చేతలకు పొంతన లేదు. ఆరోపణలపై విచారణ పూర్తయ్యే వరకు ఈటల టీఆర్ఎస్లో ఉండాల్సింది. టీఆర్ఎస్ను ఎవరైనా వీడిపోతే వారికే నష్టం. గుంపును వదిలి అడవిలోకి పోతే.. మృగాల పాలవుతారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దూసుకుపోతోంది. ఏ రాష్ట్రం కూడా తెలంగాణతో పోటీ పడే పరిస్థితి లేదు అని మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు.