హైదరాబాద్ : దక్షిణ ఛత్తీస్గడ్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడన ఆవర్తనం స్థిరంగా కొనసాగుతుంది.
దీని ప్రభావంతో రానున్న రెండురోజుల్లో తెలంగాణలోని పలు జిల్లాలో ఉరుములు మెరుపులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది.
అల్పపీడన ద్రోణి వలన ఉమ్మడి వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్నగర్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది.
మిగిలిన జిల్లాల్లో వాతావరణం పొడి ఉంటుందని వెల్లడించింది. వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతు ధాన్యం తడవకుండా చూసుకోవాలని అధికారులు సూచించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి