సూర్యాపేట : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లెప్రగతి కార్యక్రమాన్ని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. శుక్రవారం సాయంత్రం చివ్వేంల మండలం తిరుమలగిరి గ్రామం మొత్తం కలియ తిరిగారు. రంగురంగుల పూల మొక్కలతో ఇంటి వాకిలిని అందంగా తీర్చిదిద్దిన ఓ మహిళను అభినందించారు. అనంతరం వర్మీ కంపోస్టు కేంద్రాన్ని, అక్కడ ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి, ఆడిషనల్ కలెక్టర్ హేమంత్ కేశవ్ గ్రామంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కంచర్ల నిర్మలా గోవింద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
వరంగల్లో ముగ్గురు గంజాయి స్మగ్లర్ల అరెస్టు
చెరువులో పడి ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి
సమస్త జీవకోటికి మొక్కలే ప్రాణాధారం
పల్లె ప్రగతికి సహకరిద్దాం పర్యావరణాన్ని కాపాడుకుందాం
న్యూజిలాండ్ సెలబ్రేషన్స్ చూసి తట్టుకోలేకపోయాం: అశ్విన్