మణుగూరు రూరల్, జూన్ 26: జూలై 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఏడో విడుత హరితహారానికి ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు. శనివారం గుండాల, మణుగూరు తహసీల్దార్లు, అటవీ అధికారులతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ప్రతి మండలంలో 10 ఎకరాల్లో మెగా పల్లె ప్రకృతి వనం ఏర్పాటుకు కావాల్సిన స్థలంపై చర్చించారు. తహసీల్దార్లు, ఫారెస్ట్ అధికారులతో మండలాల్లోని ప్రభుత్వ, అటవీ భూములపై వివరాలు తీసుకుని సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు 10 రోజుల పాటు జరిగే ఈ హరితహారం కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు. హరితహారాన్ని విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో జడ్పీటీసీ పోశం నర్సింహారావు, తహసీల్దార్లు చంద్రశేఖర్, రమేశ్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ దౌల్య, ఎంపీవో పల్నాటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
స్టడీ మెటీరియల్ పంపిణీ
రేగా విష్ణు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్న స్టడీ మెటీరియల్ను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ప్రభుత్వ విప్ రేగా కాంతారావు నిరుద్యోగ అభ్యర్థులకు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మెటీరియల్ను సద్వినియోగం చేసుకుని యువత ప్రభుత్వ ఉద్యోగం సాధించి ఉన్నత శిఖరాలకు చేరాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పోశం నర్సింహారావు, టీఆర్ఎస్ నాయకులు సకినిపల్లి బాబురావు, మట్టపల్లి సాగర్ యాదవ్, బోశెట్టి రవి, సృజన్, సురేంద్ర పటేల్ ఉన్నారు.