నల్లగొండ : తరతమ బేధాలు లేకుండా ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందించే విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి దివ్యాంగుడికి ఆర్థిక సహాయం అందించి మరోమారు తన దయార్ద్ర హృదయాన్ని చాటుకున్నారు. నల్లగొండ జిల్లా తిప్పర్తిలో ఎస్సీ వసతి గృహంలో ఉంటున్న ఉదయ్ కుమార్ ఓ ప్రమాదంలో చేతులు కోల్పోయాడు.
కాగా, తిప్పర్తిలో రైతుల అవగాహన సదస్సులో మంత్రి జగదీష్ రెడ్డిని కలుసుకున్న ఉదయ్ కుమార్ తనకు చేతులు పోయాయని ప్రత్యామ్నాయంగా జైపూర్లో తయారు అవుతున్న ఆర్టిఫిషియల్ హ్యాండ్స్ అమర్చాలని అందుకు ఆర్థికంగా సహకరించాలని అభ్యర్థించాడు. ఈ మేరకు స్పందించిన మంత్రి జగదీష్ రెడ్డి ఆ యువకుడికి ఆపన్న హస్తం అందించి తన సహృదయతను చాటుకున్నారు.
ఇవి కూడా చదవండి..
మహబూబాబాద్ జిల్లాలో వడగండ్ల వాన
ప్రాణం పోసిన దవాఖానలో.. మొక్కను నాటిన మహిళ
ఓట్ల లెక్కింపునకు పక్కా ఏర్పాట్లు చేయండి
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న మంత్రి సత్యవతి రాథోడ్
సీనియర్ జర్నలిస్టు శ్రీధర్ మృతిపట్ల మంత్రి వేముల సంతాపం
కొనుగోలు కేంద్రాలతోనే రైతులకు మేలు