ఇదిగో ఆదాయం పన్ను శాఖ రూల్
బంగారం అంటే భారతీయులకు తరతరాల సంపద. పూర్వీకుల నుంచి సంక్రమించేదే ఎకువ. ఒకసారి బంగారం చిన్న మొత్తంలోనైనా సరే కొంటే అది జీవితాంతమే కాదు, ముందు తరాల ఆస్థి కూడా.
అయితే ఆదాయ పన్ను
చట్టంలోని నిబంధనల ప్రకారం ఓ స్థాయికి మించిన బంగారం చట్టపరమైన చికులను తీసుకువస్తుంది. సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) మార్గదర్శకాల ప్రకారం, బిల్లు లేకుండా కొంత పరిమితికి మించి బంగారం ఉంటే ఆదాయపన్ను చట్టం 132 సెక్షన్ ప్రకారం మిమ్ముల్ని ప్రశ్నించే అవకాశం ఉంది. మీ బంగారం కొంటే దాన్ని ఆదాయపన్ను రిటర్న్స్లో దాఖలు చేయాలని ఆదాయపన్ను శాఖ చెబుతున్నది.
ఎంత బంగారం?
వివాహిత మహిళ 500 గ్రాముల బంగారం వరకు ఎలాంటి బిల్లు లేకుండా కలిగి ఉండవచ్చునని ఆదాయపన్ను శాఖ నిబంధనలు తెలుపుతున్నాయి. అవివాహిత మహిళ 250 గ్రాములు, పురుషుడు 100 గ్రాముల వరకు బంగారాన్ని ఎలాంటి బిల్లు లేదా ఇన్వాయిస్ లేకుండా కలిగి ఉండవచ్చు.
ఎంతైనా బంగారాన్ని ఎలాంటి ఆధారాలు లేకుండానే కలిగి ఉండవచ్చునన్న భ్రమలో భారతీయులున్నారు. అయితే 2016 లో తీసుకు వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం చాలా పరిమితులను విధించారు. బంగారం అంటే ఆదాయపన్ను శాఖ దృష్టిలో జువెలరీ, నాణేలు, బార్లు, బిసట్లు తదితరమైనవి కూడా.
వారసత్వ సంపదగా వచ్చే బంగారంతో పాటు, బహుమానంగా బంధువుల నుంచి వచ్చే బంగారాన్ని కూడా ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు పేరొనాల్సిందే. అంతే కాదు కొత్తగా బంగారాన్ని కొంటున్నారంటే దాన్ని కూడా అసెట్ క్లాస్గా ఆదాయ పన్ను శాఖ భావిస్తుంది. అందుకుని ప్రతి బంగారం కొనుగోలునూ ఆదాయపన్ను శాఖకు తెలపాల్సిందే. బిల్లుతో సహా బంగారం ఎంత ఉన్నా దాన్ని ఐటీఆర్ పేరొని ఉంటే ఎలాంటి ఇబ్బంది రాదు. కానీ, వారసత్వంగా వచ్చిన 500 గ్రాముల బంగారం కాకుండా బిల్లు లేకుండా ఎంత చిన్న మొత్తంలో బంగారం ఉన్నా దాన్ని ఆదాయ పన్ను శాఖ పరిగణనలోకి తీసుకుంటుంది.