హైదరాబాద్ : పితృ వియోగం చెందిన నమస్తే తెలంగాణ సీఎండీ దామోదర్ రావును మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ కవిత శనివారం పరామర్శించారు. శనివారం బంజారాహిల్స్ లోని దామోదర్ రావు ఇంటికి వెళ్ళిన ఇంద్రకరణ్ రెడ్డి, వినయ్ భాస్కర్, కవిత తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నారాయణ రావు ఆత్మకు శాంతి కలగాలని వారు ఆకాంక్షించారు. దామోదర్ రావు తల్లి ఆండాలమ్మను కవిత ఓదార్చారు.