హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): అమ్మా బైలెల్లినాదో.. తల్లీ బైలెల్లినాదో.., మాయదారి మైసమ్మో మైసమ్మా.. అంటూ మైకుల్లో అమ్మలగన్న అమ్మను తలుస్తూనే కోడి కూసిన ఆదివారం.. పొద్దుమూకే దాకా సందడిగానే మారింది. ఆషాడ బోనాల ఉత్సవాలతో మహానగరంలో సంబురమే జరిగింది. పాతబస్తీలోని లాల్దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర వైభవంగా కొనసాగింది. లాల్దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి, చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి, హరిబౌలి బంగారు మైసమ్మ, అక్కన్న మాదన్నకు, ఉప్పుగూడ మహంకాళి అమ్మవారికి దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, హోం మంత్రి మహమూద్అలీ ప్రభుత్వం తరఫున పట్టువస్ర్తాలు సమర్పించారు. తెల్లవారుజామునుంచే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయాలకు తరలివచ్చారు. భక్తులు కరోనా నిబంధనలు పాటిస్తూ.. బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. మరోవైపు, గోల్కొండలో ఏడో బోనం సమర్పణ అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.