హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. కరోనా వైరస్ ప్రభావం ఉన్నందున ఎవరి ఇళ్లలో వారే పండుగను జరుపుకోవాలని కోరారు. శ్రీరాముడి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేలా చూడాలని, కరోనా మహమ్మారి నుంచి త్వరగా విముక్తి కల్పించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను అని ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.