కోల్కతా: చెదురుమొదురు ఘటనలు మినహా పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఓటర్లు ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం 11.36 గంటల వరకు 37.72 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు వెల్లడించారు. బెంగాల్లో మొత్తం ఎనిమిది విడుతల ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఇవాళ ఏడో విడుత పోలింగ్ జరుగుతున్నది. 29న తుది విడుత పోలింగ్ జరుగనున్నది. మే 2న ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు.