హైదరాబాద్: మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ మృతి పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయనకు సద్గతులు కలగాలని ప్రార్థించారు.
మాజీ మంత్రి చందూలాల్ అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరమని చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు జీ. రంజిత్ రెడ్డి అన్నారు. ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషించారని చెప్పారు. గిరిజనుల అభివృద్ధి కోసం నిరంతరం పరితపించే వారన్నారు. చందూలాల్ మరణం పార్టీకి, ప్రజలకు తీరని లోటన్నారు. చందూలాల్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..