నిర్మల్ : రైతుల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్ రైతు సంక్షేమాభివృద్ధే లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గురువారం బ్రాహ్మణగావ్లో నిర్మించిన రైతు వేదికను ఎమ్మెల్యే విఠల్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతిగా పని చేస్తున్నారని, ఆయన ఆలోచనలకు అనుగుణంగా రైతు వేదికలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
సీఎం కేసీఆర్ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారని, 24 గంటల ఉచిత నాణ్యమైన కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మత్రి తెలిపారు. పెట్టుబడి సాయం కోసం ప్రతి సంవత్సరం రెండు దఫాలుగా రైతు బంధు, చనిపోయిన రైతు కుటుంబాన్ని ఆదుకోవడానికి రైతుబీమా పేరిట రూ.5 లక్షల అందజేస్తోందని తెలిపారు. వ్యవసాయ సమస్యల పరిష్కారం కోసం రైతు వేదికలను నిర్మిస్తోందని పేర్కొన్నారు.
అంతకుముందు హరితహారం కార్యక్రమంలో భాగంగా మంత్రి మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ కే. విజయలక్ష్మి రెడ్డి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
పరవళ్లు తొక్కుతున్న పొచ్చర జలపాతం
నరసింహులపల్లి సమస్యలను పరిష్కరిస్తా : మంత్రి కొప్పుల
టీఆర్ఎస్ పార్టీలోకి ఎల్ రమణ?
బ్లాక్ ఫంగస్తో హెల్త్ సూపర్ వైజర్ మృతి