నిర్మల్ అర్బన్ : కరోనా మహమ్మారి లాంటి విపత్కర పరిస్థితుల్లో తమ ప్రాణాలను పణంగా పెట్టి పారిశుద్ధ్య కార్మికులు, వైద్య సిబ్బంది, పోలీసులు అమోఘమైన సేవలు అందిస్తున్నారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శనివారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో మంత్రి సోదరుడు అల్లోల సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన (సుమారు 500 మందికి) మధ్యాహ్న భోజన పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి నుంచి కాపాడటం కోసం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు,వైద్య సిబ్బంది, పోలీసులు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నిరంతరాయంగా పని చేస్తున్నారని అన్నారు.
రెండు, మూడు రోజుల్లో IKR ఫౌండేషన్ ఆధ్వర్యంలో వెయ్యి మందికి 1000 రూపాయలకు సరిపడా నిత్యావసర వస్తువులు పంపిణీ చేయనున్నామని మంత్రి తెలిపారు. అనంతరం ప్రధాన ఆసుపత్రి వద్ద వైద్య సిబ్బంది, రోగులకు ఆయన భోజనాన్ని అందజేశారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్, డీసీసీబీ వైస్ చైర్మన్ రఘు నందన్ రెడ్డి, ఎంపీపీ రామేశ్వర రెడ్డి, సురేందర్ రెడ్డి, మురళీధర్ రెడ్డి, టీఆర్ఎస్ యువజన నేత అల్లోల గౌతమ్ రెడ్డి, అల్లోల రాజ్ కిరణ్ రెడ్డి, నితీష్ రెడ్డి, రేవంత్ రెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
కరోనాతో కొల్లాపూర్ తహసీల్దార్ మృతి
అంకిరెడ్డిపల్లిలో బ్లాక్ ఫంగస్తో వ్యక్తి మృతి
రేపటి నుంచి ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు వ్యాక్సినేషన్
కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న మంత్రి సత్యవతి