ఆదిలాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ డీసీసీబీ చైర్మన్ కాంబ్లే నాందేవ్ అంత్యక్రియలు గురువారం జిల్లాలోని నార్నూర్ మండలం ఆయన స్వగ్రామమైన గుంజాలలో జరిగాయి. అంత్యక్రియల్లో దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొని నివాళులు అర్పించారు. నాందేవ్ భౌతికకాయం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. నాందేవ్ కుటుంబ సభ్యులను ఓదార్చారు.
మంత్రి పాటు ఎమ్మెల్యేలు జోగురామన్న, రాథోడ్ బాపురావు, ఆత్రం సక్కు, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ కోవా లక్ష్మి, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ చైర్మన్ దేవేందర్ రెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లా డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డీసీసీబీ వైస్ చైర్మన్ రఘువర్ధన్ రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ గౌడ్, మాజీ ఎంపీ నగేష్, మాజీ డీసీసీబీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, పలువురు నివాళులర్పించారు. ఏజెన్సీ ఏరియాలో దళితుల హక్కుల కోసం పోరాడిన దళిత నేత నాందేవ్ అంతిమయాత్రలో పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
మీరాబాయికి మరో బంపర్ ఆఫర్.. జీవితకాలం సినిమా టికెట్లు ఫ్రీ
Tokyo Olympics: స్విమ్మింగ్ రిలే ఈవెంట్లో చైనీస్ టీమ్ వరల్డ్ రికార్డ్
కొండగట్టులో నవీన్ మిట్టల్ ప్రత్యేక పూజలు