హైదరాబాద్ : తలసీమియా, హీమోఫీలియా, సికిల్ సెల్ ఎనీమియా రక్త సమస్య బాధితులకు దివ్యాంగుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేసే విషయంలో తగు చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. గురువారం పంచాయతీ రాజ్ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, దివ్యాంగుల సంక్షేమం కమిషనర్ దివ్య దేవరాజన్, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్విలతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు పూర్తి స్థాయిలో అమలు జరిగి వారికి సేవలు అందించే దిశగా తగిన చర్యలు చేపట్టాలని చెప్పారు. దరఖాస్తు చేసుకోవడానికి వెసులుబాటు, ధ్రువీకరించే కమిటీలు, ధ్రువీకరణ పత్రాల జారీ మీద దృష్టి సారించింది వారికి త్వరగా సదుపాయాలు అందే విధంగా చూడాలని సూచించారు.