హైదరాబాద్ : ఆక్సిజన్ సరఫరాతో పాటు ఇతర అంశాలపై మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్లో జరిగిన ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా లిక్విడ్ ఆక్సిజన్ స్టోరేజ్ యూనిట్లు, ప్లాంట్ల నిర్మాణంపై చర్చించారు. ఆక్సిజన్ క్రయోజెనిక్ ట్యాంకర్ల సరఫరాపై కూడా చర్చించారు. ఆక్సిజన్ కోసం తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి హరీష్ రావు ఆదేశించారు. అవసరమైన ప్లాంట్లు, సామాగ్రి సమకూర్చుకోవాలని ఆదేశించారు.