కరీంనగర్: రాష్ట్ర ప్రజలకు మంత్రి హరీశ్ రావు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే ఒడితల సతీష్ బాబు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్తో కలిసి హుజూరాబాద్లో రాఖీ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ కనమల విజయ, మున్సిపల్ చైర్మన్ గంధే రాధిక, ఇల్లంతకుంట ఎంపీపీ పాపని, వీణవంక ఎంపీపీ ముసిపట్ల రేణుక, హుజురాబాద్ ఎంపిపి ఇరుమల్ల రాణి, నాలుగు మండలాల మహిళా ప్రజాప్రతినిథులు మంత్రి, ఎమ్మెల్యేకు రాఖీ కట్టారు.