కరీంనగర్ : హుజూరాబాద్ నియోజకవర్గంలో కేసీఆర్ ఆటోనగర్కు మంత్రులు హరీశ్రావు, గంగుల కమలాకర్ కలిసి శనివారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. ఈ ఆటోనగర్లో 347 కుటుంబాలకు ప్లాట్లు కేటాయించి, శాశ్వత వర్క్ షెడ్లు కట్టిస్తామన్నారు. లబ్దిదారులు అద్దె చెల్లించాల్సిన అవసరం లేదు.. ఈ వర్క్ షెడ్లు మీకు శాశ్వత ఆస్తిగా ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు. టీఎస్ఐఐసీ ద్వారా ఆటోనగర్ నిర్మాణం కోసం రూ. 3 కోట్లు మంజూరు చేశామని తెలిపారు.
హుజురాబాద్లోని మెకానిక్లందరూ ఇక్కడే ఉండేలా చూసుకుంటే.. అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అని మంత్రి పేర్కొన్నారు. గతంలో తాము ఆటోనగర్ ఏర్పాటుకు హామీ ఇచ్చినప్పుడు మీకందరికి అనుమానం ఉండేది. కానీ ఇంత వేగంగా ఆటోనగర్ ఏర్పాటు అవుతుందా? అనే ప్రశ్న మీలో వచ్చి ఉండొచ్చు. తమకు చెప్పింది చెప్పినట్లు చేసుడే తప్ప.. మాట తప్పడం తమకు తెలియదన్నారు. రేపురా.. మాపురా అనే ఉద్దెర బేరాలు తమ దగ్గర ఉండవు అని మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు.